Monday, September 30, 2024
HomeUncategorizedహైదరాబాద్‌ మెట్రోలో 50కోట్ల మంది తిరిగారు

హైదరాబాద్‌ మెట్రోలో 50కోట్ల మంది తిరిగారు

Date:

హైదరాబాద్ మహానగరంలో ప్రజాదరణ చూరగొంటున్న హైదరాబాద్‌ మెట్రో.. మరో ఘనతను దక్కించుకుంది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. 

గ్రీన్‌ మైల్స్‌ లాయల్టీ క్లబ్‌ను ఆవిష్కరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందని చెప్పారు. మెట్రో రైలు వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయ్యిందని, ప్రతి రోజూ సగటున 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రెండో దశ మెట్రోరైలుకు కూడా ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధమైనట్లు తెలిపారు.