Monday, September 30, 2024
HomeUncategorizedమీ మేనిఫెస్టోలు బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చే దమ్ముందా

మీ మేనిఫెస్టోలు బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చే దమ్ముందా

Date:

ప్రజలను ప్రలోభ పెట్టేందుకు అన్ని రాజకీయపార్టీలు వారి మేనిఫెస్టోలు ప్రకటించాయని, వారి మేనిఫెస్టోలు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలని జై భారత్ పార్టీ ఉత్తర విశాఖ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ సిబిఐ జెడీ లక్ష్మినారాయణ అన్నారు. మంగళవారం మద్దిలపాలెం పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఏదైనా సంకల్పం చేసినప్పుడు సంకల్పం వెనకాల దైవ బలం కావాలి. మనం ఎంత ప్రయత్నించిన చివరి మెట్టుకు దైవం బలం ఉండాలి. ఆ దైవం బలం నాకు మీ నుండే రావాలి. ఎందుకంటే నేను ఇప్పుడు రాజకీయంలో పెద్ద శక్తులతో పోరాడుతున్నాను. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వారు నాయకులు అనే ఆలోచన ఉంది. దానిని మార్చాలి. సామాన్యుడు కూడా రాజకీయాల్లో వచ్చి మార్పు తీసుకురాగలరని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. 

*నాయకులు పెట్టే కోట్ల డబ్బులు ఎక్కడివి*

ఎన్నికలలో ఒక్కో ఎమ్మెల్యేకు 40 కోట్లు, ఎంపీ అభ్యర్థికి 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ వాటిని సంపాదించాలంటే ప్రజలనే పన్నుల రూపంలో, ధరల రూపంలో పీడించాలి. రాజకీయాలు మనకు సంబంధం లేదు అని చాలా మంది అనుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితాలను రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. రాజకీయాలను మార్చుతే పిల్లలు బాగుంటారు. వాతావరణం బాగుంటుంది.

*సులభంగా డబ్బు డ్రగ్స్ లో దొరుకుతుంది*

విశాఖపట్నంలో విచ్చలవిడిలో డ్రగ్స్ పట్టుబడింది. అందులో చాలామంది రాజకీయనాయకుల హస్తం ఉందని మీడియా ద్వారా తెలిసింది. అంతకుముందు వచ్చిన డ్రగ్స్ ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు. మాకు డబ్బు కావాలి సమాజం, యువత ఏటు పోయినా ఫర్వాలేదు అని నాయకులు అనుకుంటున్నారు. అందుకు మనం చెడు రాజకీయాలను ప్రక్షాళన చేయాలి. దుష్టశక్తులపై విజయం సాధించే శక్తిని మీరంతా ఇవ్వాలి. ధార్మిక సంఘాల అభివృద్దికి కృషి చేస్తాను. కమ్యూనిటి హల్స్ నిర్మాణం చేపడుతాను. విదేశీ విద్యకు సపోర్టు చేస్తాను. పాస్టర్స్ కూడా కాలనీల నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పాస్టర్లు పాల్గొన్నారు.