దేశంలోని ఉత్తరభారతంలో కొన్ని రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ఓ యూట్యూబర్ కారులోనే మినీ స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేసి చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు ఏకంగా ట్రాక్టర్ ట్రాలీని మినీ స్విమ్మింగ్ పూల్గా మార్చేశారు.
అమ్రోహాకి చెందిన కొందరు వ్యక్తులు ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్ పూల్లా మార్చేశారు. నీరు లీక్ అవ్వకుండా ట్రాలీని మొత్తం ఓ మందపాటి పట్టతో కవర్ చేశారు. అందులో నీళ్లు నింపి చిన్నారులు, కొందరు యువత స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు. నీటిలో మునుగుతూ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.