అవయదానంలో ఇప్పటివరకు కళ్లు, కిడ్నీ, గుండె దానాల గురించి మనం ఇప్పటివరకు విన్నాం. కానీ ఇప్పుడు రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి రెండు చేతులను ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆస్పత్రి వైద్యబృందం అతికించింది.
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి (45) పెయింటర్గా పని చేసేవాడు. 2020లో జరిగిన రైలు ప్రమాదంలో అతడు తన రెండు చేతులను కోల్పోయాడు. తన చేతులను తిరిగి పొందేందుకు వైద్యులను సంప్రదించాడు. ఇటీవల బ్రెయిన్ డెడ్తో మరణించిన మహిళ చేతులను ఇతడికి విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. చేతులను, వేళ్లను కదిలించగలుగుతున్నాడని వైద్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో మళ్లీ అతడి జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ శస్త్రచికిత్సను 12 గంటల్లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. ఆమె అవయవాలతో మరో ముగ్గురికి కొత్త జీవితం ప్రసాదించారు. గతంలోనూ ఇలాంటి శస్త్రచికిత్సలు జరిగాయి. ఎడమ చేతిని కోల్పోయిన వ్యక్తికి హరియాణాలోని అమృత ఆసుపత్రిలో సర్జరీ చేసి అవయవాన్ని అతికించారు.