Monday, September 30, 2024
HomeUncategorizedకేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ అంశంపై వాదనలు వింటాం

కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ అంశంపై వాదనలు వింటాం

Date:

లిక్కర్ కేసులో అరెస్టు అయినా అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను మే 7న విచారిస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు తెలిపింది. ఈక్రమంలో విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.

‘ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఆయన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ విచారణను పరిశీలిస్తాం’ అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. దీనిపై స్పందిస్తూ.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరఫున అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు పేర్కొన్నారు. దాంతో మరింత స్పష్టతనిచ్చిన ధర్మాసనం.. ‘కేవలం పిటిషన్‌ను మాత్రమే విచారిస్తాం, బెయిల్‌ ఇస్తామని చెప్పడం లేదు. చివరకు బెయిల్‌ ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు’ అని తెలిపింది. ఇందుకు సంబంధించి వాదనల కోసం సిద్ధమై రావాలని ఈడీకి సుప్రీం ధర్మాసనం సూచించింది.