ఆంధ్రప్రదేశ్ సీఎం దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకొవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 32వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే జగన్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కాకినాడలో నిర్వహించిన సభలో పవన్ ప్రసంగించారు. ”కాకినాడకు రక్షణ కల్పించే మడ అడవులను ధ్వంసం చేస్తున్నారు. గంజాయి, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా. నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో మార్పు రావాలనే రాజకీయాల్లోకి వచ్చా. పార్టీలు మారే వ్యక్తులు కాదు.. స్థిరంగా ఉండే వారు మనకు కావాలి. వైకాపాకు ఓటేస్తే చేజేతులా గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టే. సమాజాన్ని కాపాడాలి.. ధర్మాన్ని నిలబెట్టాలి.. అదే నా విధానం అన్నారు. ఎన్నికల్లో కూటమిదే అఖండ విజయం” అని పవన్ కల్యాణ్ అన్నారు.