Monday, September 30, 2024
Homeజాతీయంరెజ్ల‌ర్ల‌ను రోడ్డున ప‌డేసిన బిజెపి ప్ర‌భుత్వం

రెజ్ల‌ర్ల‌ను రోడ్డున ప‌డేసిన బిజెపి ప్ర‌భుత్వం

Date:

‘మన దేశ స్టార్‌ రెజర్లు అసలు ఏం చేశారు..? న్యాయం కోసం రోడ్డుపై నిరసనలు తెలిపారు. అయినా, రెజ్లర్లను కలవడానికి ప్రధాని నరేంద్ర మోదీకి 5 నిమిషాల సమయం కూడా దొరకలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక వాద్రా అన్నారు. ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా వారితో సమావేశం కాలేదు. రెజ్లర్లను భాజపా ప్రభుత్వం రోడ్డున పడేసింది. ఒలింపిక్స్‌లో ఏం జరిగిందో ప్రజలంతా చూశారు. ఆత్మగౌరవం కోసం మీరంతా పోరాడుతున్నారు. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఇంతవరకు మీకోసం మోదీ సర్కార్‌ ఏమీ చేయలేదు. హరియాణా ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలంటే భాజపా ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది” అంటూ ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు.

భారత రాజ్యాంగ మార్పు గురించి కొందరు నాయకులు మాట్లాడుతున్నారని.. అలాంటి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని హరియాణా ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. కాగా.. హరియాణాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు 8న విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్‌, భాజపాతో సహా ఇతర పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెజ్లర్ల సమస్యను ప్రియాంక ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీపై విమర్శలు కురిపించారు.