Monday, September 30, 2024
Homeక్రైంచెల్లెలు చేసుకున్న ప్రేమ వివాహం సోదరులకు ఇష్టం లేదు

చెల్లెలు చేసుకున్న ప్రేమ వివాహం సోదరులకు ఇష్టం లేదు

Date:

చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకొవడం సోదరులు (పెదనాన్న కుమారులు) ఇష్టం లేదు. వారు పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి పోలీసులకు చిక్కారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది. గ్రామీణం ఎస్ఐ బి.శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. చిరుతానుపాడుకి చెందిన పద్దం ఉంగయ్య(20) సమీప కొత్తూరు గొత్తికోయ గుంపునకు చెందిన మడవి ఉంగీని నెలరోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

ఇది ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు రెండ్రోజుల తర్వాత చిరుతానుపాడులో పంచాయితీ పెట్టించారు. పెద్ద మనుషులు ఉంగయ్యకు రూ.1.50 లక్షల జరిమానా విధించారు. ఉంగయ్య అదే రోజు రూ.1.20 లక్షలు చెల్లించి భార్యను ఇంటికి తీసుకెళ్లారు. మిగతా రూ.30 వేలు ఇవ్వాలంటూ ఏప్రిల్‌ 26న యువతి పెదనాన్న కుమారులు ఇడమయ్య, అడమయ్య, ఒక బాలుడు(16) ఉంగయ్య ఇంటికొచ్చారు.

తన వద్ద డబ్బుల్లేవని చెప్పడంతో చెల్లెల్ని ద్విచక్రవాహనంపై తమ ఊరికి తీసుకెళ్లారు. పుట్టింటికి చేరుకున్న రోజు రాత్రే ఉంగీ కనిపించకుండా పోయారు. ఆమెను వెతుక్కుంటూ బయల్దేరిన సోదరులకు చిరుతానుపాడు సమీపంలో ఉంగయ్య తారసడ్డారు. తమ చెల్లెలు ఎక్కడని ఆయనతో వారు గొడవపడ్డారు. క్షణికావేశంలో కండువాను మెడకు బిగించి హత్యచేశారు.