అడవి ఏనుగుల మంద దాడిలో ఓ వీడియో జర్నలిస్టు మరణించాడు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా కొట్టెకాడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొట్టెకాడ్లో ఓ ఏనుగుల మంద నదిని దాటుతుండగా ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించాలని వీడియో జర్నలిస్టు ఏవీ ముకేశ్ భావించాడు.
ఆ మేరకు కెమెరా సెట్ చేసుకుని వీడియో తీస్తుండగా ఓ అడవి ఏనుగు అతడి వైపు దూసుకొచ్చింది. వచ్చిరావడంతోనే అతడిపై దాడిచేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముకేశ్ను తన వెంట ఉన్నవాళ్లు పాలక్కాడ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.