Tuesday, October 1, 2024
HomeUncategorizedజగన్ విషయంలో మారిన మోడీ స్వరం

జగన్ విషయంలో మారిన మోడీ స్వరం

Date:

ఏపీ ప్రజలు వైసీపీకి ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, కానీ వైసీపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. ఏపీలో ఎన్డీయే కూటమి తరుఫున  రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించిన మోడీ.. అభివృద్ధి శూన్యం, అవినీతిలో మాత్రం నంబర్‌వన్ అంటూ ఆరోపించారు. ఐదేళ్లల్లో ఏపీలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. వైసీపీకి ఆర్థిక క్రమశిక్షణ లేదని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న వైసీపీ.. ఐదేళ్లలో ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేదని తప్పుబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ అభివృద్ధి అనే పట్టాలపై పరిగెత్తిందన్న మోడీ.. వైసీపీ హయాంలో ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపైనా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న ప్రధాని.. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఈ పరిస్థితి మారుస్తామని అన్నారు.

ఏపీలో ఎన్డీఏ కూటమితో ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు వైసీపీ తలపడుతున్నాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ప్రతిచోటా ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందన్న మోదీ.. మే 13వ తేదీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని అన్నారు.