Monday, September 30, 2024
HomeUncategorizedమా నియంత్రణ సిబిఐపై లేదు

మా నియంత్రణ సిబిఐపై లేదు

Date:

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై తమ నియంత్రణ లేదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సంస్థ దర్యాప్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 131 ప్రకారం.. కేంద్రంపై బెంగాల్‌ ప్రభుత్వం కేసు వేసింది. సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మితిని రాష్ట్రం ఉపసంహరించుకున్నా.. దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి రాష్ట్రంలో కేసులను దర్యాప్తు చేస్తోందని ఆరోపించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కేంద్రం, రాష్ట్రాల అధికార పరిధికి సంబంధించింది. అయితే, కేంద్రం ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనానికి రాజ్యాంగంలోని 131వ అధికరణం రాజ్యాంగంలోని అత్యంత పవిత్రమైన అధికార పరిధి అని, అందులోని నిబంధనలు ఉండవని చెప్పారు. కేసులను భారత ప్రభుత్వం దాఖలు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని ఎస్‌జీ తెలిపారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో లేదని తెలిపారు. వాస్తవానికి 2018 నవంబర్‌ 16న బెంగాల్‌ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి దర్యాప్తు చేసేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దాంతో బెంగాల్‌లో సీబీఐ దాడులు జరుపడం, దర్యాప్తు చేయలేదు. అయితే, ఇటీవల ఈడీ బృందంపై జరిగిన దాడిని సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. సందేశ్‌ఖాలీలో అక్రమ భూకజ్జా తదితర కేసులపై సైతం విచారణ జరుపుతుండగా.. బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.