దేశంలో బిజెపి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించడంపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. తమ పార్టీకి రిజర్వేషన్లను రద్దు చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. హస్తం పార్టీ పన్నుతున్న కుట్రలను ముందుకుసాగనివ్వమని దుయ్యబట్టారు. ఎన్నికల నేపథ్యంలో చండీగఢ్లో బుధవారం ఏర్పాటుచేసిన ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు.
అసత్యాన్ని బిగ్గరగా పునరావృతం చేస్తూ ప్రజలను నమ్మించడమే కాంగ్రెస్ ఫార్ములా. మరోసారి మోడీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని అబద్ధాలు చెబుతున్నారు. నా ఫేక్ వీడియోను సర్క్లేట్ చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ఏనాడు రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావించలేదు. రిజర్వేషన్లను రద్దు చేయం.. చేయనివ్వం” అని అమిత్ షా పేర్కొన్నారు.