ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణకు ముస్లింలు ఎక్కువగా కండోమ్లు వాడుతున్నారని.. ఈ విషయం చెప్పడానికి తనకు సిగ్గు అనిపించడం లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఒక ర్యాలీలో మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారన్న భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ముస్లింలలో జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గింది. ముస్లింలు కండోమ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. ఈ విషయం చెప్పడానికి నాకు సిగ్గు అనిపించడం లేదు..’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలు మెజారిటీ కమ్యూనిటీ అవుతారని హిందువులలో భయాన్ని కలిగిస్తున్నారు.. ఎంతకాలం ముస్లింల గురించి చెప్పి భయాన్ని సృష్టిస్తారు? మా మతం వేరు.. కానీ మేము ఈ దేశానికి చెందినవాళ్ళమే.. అంటూ అసదుద్దీన్ పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం జనాభా గణాంకాలు, రిజర్వేషన్ల బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీతోపాటు.. మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది.