Sunday, October 6, 2024
HomeUncategorized56ఏళ్ల వ‌య‌స్సులో కేంద్ర‌మంత్రి స్రై డైవింగ్‌

56ఏళ్ల వ‌య‌స్సులో కేంద్ర‌మంత్రి స్రై డైవింగ్‌

Date:

56 ఏళ్ల వయసులో కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ అరుదైన సాహసం చేశారు. భారత దేశంలో ప్రైవేటు రంగంలో మొట్టమొదటి స్కై డైవింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు.

భారత్‌తో పాటు ఈ ప్రపంచానికి ఈ రోజు అతిముఖ్యమైనది. హరియాణాలోని నార్నౌల్‌లో ఈ కేంద్రం ఏర్పాటైంది. దేశ పర్యటక శాఖ మంత్రిగా ప్రజలకు ఈ తరహా సదుపాయాలు అందుబాటులో ఉంచడం నా బాధ్యత” అని మీడియాతో మాట్లాడారు. అలాగే తాను స్కై డైవింగ్ చేసిన చిత్రాలను ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ”ఆ థ్రిల్‌ను నేనూ ఎంజాయ్‌ చేశాను. భారత పర్యటక రంగం అంతర్జాతీయ వసతులను పొందుతున్నందుకు సంతోషంగా ఉంది” అంటూ పోస్టు పెట్టారు. స్కై డైవింగ్‌ ఎంతో సాహసంతో కూడుకున్న ఓ విన్యాసం. మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు అవసరాన్ని బట్టి ప్యారాచూట్‌ జంప్‌ చేసేవారు. ఇటీవలి కాలంలో సామాన్యులు సైతం స్కై డైవింగ్ చేస్తున్నారు.