Wednesday, September 25, 2024
HomeUncategorized15 మంది భారత జాలర్లు అరెస్ట్

15 మంది భారత జాలర్లు అరెస్ట్

Date:

భారత్‌కు చెందిన 15 మంది జాలర్లను శ్రీలంక నౌకాదళం శుక్రవారం అరెస్టు చేసింది. ఉత్తర జాఫ్నా ద్వీప సమీపంలోని కరైనగర్ తీరంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ కోసం వారిని ఫిషింగ్ డైరెక్టరేట్‌కు అప్పగించినట్లు తెలిపింది. కొద్దిరోజుల క్రితం భారత జాలర్లు తమ పరిధిని దాటి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించి చేపల వేట సాగిస్తున్నారని ఆ దేశ జాలర్లు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు శ్రీలంక నౌకాదళం 16 బోట్లను జప్తు చేయడంతోపాటు 225 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇది ఆరో ఘటన. జనవరిలో రెండు సార్లు, ఫిబ్రవరిలో మూడుసార్లు భారత జాలర్ల అరెస్టులు చోటుచేసుకున్నాయి. భారత్‌ – శ్రీలంకల మధ్య చేపలవేట వివాదం ఎంతోకాలంగా నెలకొంది. తమిళనాడు, శ్రీలంకను వేరు చేసే పాక్‌ జలసంధిలో మత్స్యసంపద సమృద్ధిగా ఉంది. ఇక్కడ చేపల వేటకు వెళ్లిన భారత జాలర్లను గతంలో పలుమార్లు శ్రీలంక అధికారులు అరెస్టు చేయడమేగాక, వారిపై కాల్పులు జరిపిన సందర్భాలున్నాయి. 2023లో శ్రీలంక నేవీ సిబ్బంది 240 మంది భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది.