Friday, September 20, 2024
HomeUncategorizedహెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఎక్కువ మ‌ర‌ణాలు

హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఎక్కువ మ‌ర‌ణాలు

Date:

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్ర‌మాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. రోడ్డు ప్ర‌మాదాల్లో ఎక్కువ మ‌ర‌ణాల‌కు ప్ర‌ధాన కార‌ణం హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే అనేకమంది మరణిస్తున్నారని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ద్విచక్ర వాహన తయారీదారులు వాహన కొనుగోలుదారులకు తగ్గింపు ధర లేదా సహేతుకమైన ధరలకు హెల్మెట్లను అందించాలని కోరారు. బుధవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ”2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 50,029మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల, ద్విచక్ర వాహన తయారీదారులకు నా అభ్యర్థన ఏంటంటే.. వాహనం కొనుగోలు చేసేవారికి హెల్మెట్‌లపై కొంత డిస్కౌంట్‌ ఇవ్వగలిగితే ప్రజల ప్రాణాల్ని కాపాడగలం అనిపించింది” అన్నారు.

పాఠశాల బస్సులకు కూడా పార్కింగ్‌ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్లాన్‌ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీగా ఫైన్‌లను అమలు చేసిందన్న ఆయన.. నిజానికి దీన్ని సమర్థంగా అమలుచేయడం కూడా పెద్ద సవాల్‌గా ఉందన్నారు. దేశంలోని ప్రతి తాలుకాలో డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభించాలన్నది తన ఆశయమని తెలిపారు.