Sunday, September 29, 2024
HomeUncategorizedసివిల్స్ ఫ‌లితాల్లో మెరిసిన పాల‌మూరు బిడ్డ

సివిల్స్ ఫ‌లితాల్లో మెరిసిన పాల‌మూరు బిడ్డ

Date:

యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫ‌లితాల్లో తెలంగాణ రాష్ట్రం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన దోనూరు అన‌న్య రెడ్డి తొలి ప్ర‌య‌త్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. ఆలిండియాలో థ‌ర్డ్ ర్యాంకు సాధించిన అన‌న్య‌కు అభినంద‌న‌లు వెలువెత్తుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. అడ్డాకుల మండ‌లం పొన్న‌క‌ల్ గ్రామం మాది. ఢిల్లీ యూనివ‌ర్సిటీ అనుబంధ కాలేజీ మిరాండ హౌస్‌లో జియోగ్ర‌ఫీలో డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ చ‌దువుతున్న స‌మ‌యంలోనే సివిల్స్ మీద దృష్టి సారించాను. దీంతో రోజుకు 12 నుంచి 14 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివాను. ఆంథ్రోపాల‌జీ ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్ట్‌గా ఎంచుకున్నాను. ఇందుకు హైద‌రాబాద్‌లోనే కోచింగ్ తీసుకుని ప‌క‌డ్బందీగా చ‌దివాను. అయితే ఈ ఫ‌లితాల్లో మూడో ర్యాంకు వ‌స్త‌ద‌ని ఊహించ‌లేదు అని అన‌న్య రెడ్డి తెలిపారు.

సామాజిక సేవ చేయాల‌నే త‌ప‌న త‌న‌లో చిన్న‌ప‌టి నుంచి ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే సివిల్స్‌పై దృష్టి సారించి సాధించాను. త‌మ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని తానేన‌ని చెప్పారు. నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కాగా అమ్మ గృహిణి అని పేర్కొన్నారు.