దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, గతేడాది మనదేశంలో 412432 రోడ్డు ప్రమాదాల్లో 16,849 మంది మరణించారు. మే, జూన్లలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మేలో 43307, జూన్లో 39432 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇందులో మేలో 16791 మంది, జూన్లో 14762 మంది ప్రాణాలు కోల్పోయారు.
*ఎండాకాలం పెరగడానికి కారణం*
పొగమంచు ఎక్కువగా ఉండే జనవరిలో 37040 రోడ్డు ప్రమాదాల్లో 13677 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర భారతదేశంలో జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈ కాలంలో జూలైలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 37228 రోడ్డు ప్రమాదాల్లో 12266 మంది ప్రాణాలు కోల్పోయారు. గణాంకాల ప్రకారం, పొగమంచు, వానాకాలంలో కంటే ఎండాకాలంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడం వెనుక కారణాలేంటని రవాణా నిపుణులు చెబుతున్నారు.
*ఎండాకాలంలో సందర్శనలు ఎక్కువ*
రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఆర్ఆర్ఐ) ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎస్కె పాండే చెబుతున్నారు. పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ప్రారంభమయిన తర్వాత ప్రజలు గ్రామాలకు లేదా సందర్శనల కోసం వెళతారు. ఈ విధంగా రోడ్డుపై ట్రాఫిక్ పెరిగి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదే సమయంలో, పొగమంచు, వర్షంలో తక్కువ సంఖ్యలో ప్రజలు బయటకు వెళతారు.. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటుందన్నారు.