తమ జీవితకాలంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలుగంటారు. కొంతమందికి అది సాధ్యం అయితే మరికొంతమంది కల, కలగానే మిగిలిపోతుంది. అలాంటిది ఒక వ్యక్తి రెండు కాళ్లు లేకున్నా 12వ సారి పరమ పవిత్రమైన అమర్నాథ్ యాత్రకు బయలు దేరాడు. శివుడి కృపతో ఏటా ఈ యాత్ర పూర్తిచేస్తున్నట్టు చెప్తున్నా డు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఆనంద్ సింగ్ 2002లో ఒక ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయాడు. అయినా..శివ భక్తుడైన సింగ్.. మొక్కవోని దీక్షతో ఏటా అమర్నాథ్ యాత్ర చేపడుతున్నాడు.
3,880 మీటర్ల ఎత్తులోని గుహకు చేరుకొని శివలింగాన్ని దర్శించుకుంటు న్నాడు. 2010లో తాను ఈ యాత్ర చేపట్టానని, 2013లో కేదార్నాథ్లో వరదల వల్ల ఒకసారి, 2019లో కొవిడ్ వల్ల రెండు సార్లు మాత్రమే అమర్నాథ్కు రాలేకపోయానని తెలిపాడు. మొదట నాలుగుసార్లు ట్రక్టైర్ కటౌట్లో కూర్చొని చేతులతో డ్రాగ్ చేసుకుంటూ వెళ్లానని, ఇప్పుడు మాత్రం పల్లకిలో వెళ్తున్నట్టు చెప్పాడు. తన ప్రయత్నా న్ని కొందరు విమర్శిస్తున్నారని, అయినా పట్టించుకోనన్నాడు.