Monday, September 23, 2024
HomeUncategorizedరాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్‌ యాదవ్

రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్‌ యాదవ్

Date:

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతుంది. ఈ యాత్ర ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరానికి చేరుకుంది. ఈ రాహుల్‌ యాత్రలో అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొన్న కీలక ప్రతిపక్ష నేత అఖిలేష్‌ యాదవే కావడం గమనార్హం. ఇప్పటివరకు రాహుల్‌ యాత్రలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలెవరూ అఖిలేష్‌ యాదవ్‌ స్థాయిలో లేరు. ఇటీవల పశ్చిమబెంగాల్‌ మీదుగా రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సాగింది. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతాబెనర్జీ యాత్రలో పాల్గొనలేదు.

ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల పంపకం విషయంలో సమాజ్‌వాది-కాంగ్రెస్ పార్టీల మధ్య కొద్ది రోజులపాటు కొనసాగిన ప్రతిష్ఠంభనకు ఇటీవలే తెరపడింది. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శ ప్రియాంకాగాంధీ సమాజ్‌వాది పార్టీ ఆఫర్‌ చేసిన 17 సీట్లకు అంగీకారం తెలుపడంతో ఆ ప్రతిష్ఠంభనకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ క్రమంలో ఇవాళ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.