Sunday, September 22, 2024
HomeUncategorizedమొదట మూసీ నది శుద్ధి చేపట్టాలి

మొదట మూసీ నది శుద్ధి చేపట్టాలి

Date:

మొదటగా మూసీ నది శుద్ధి చేపట్టాలని, మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నానక్‌రామ్‌గూడలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక కట్టడాలను కలుపుతూ మూసీ అభివృద్ధి ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. అధికారులకు పని విభజన చేసి అభివృద్ధిపై కసరత్తు వేగవంతం చేయాలని చెప్పారు.

సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో సీఎం దిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది