Sunday, September 22, 2024
HomeUncategorizedమేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు

Date:

తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్-వరంగల్, నిజామాబాద్-వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ మార్గంలో నడుస్తాయని తెలిపారు. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు ప్రాంతాలకు చెందిన వారికి ఉపయోగపడనున్నాయి.

సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్-సిర్పూర్ కాగజ్‌నగర్ (07017/07018), సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్ మధ్య (07014/07015) నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ (7019/07020) రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్ల కోసం రూ.3కోట్లను కేటాయించిందని వివరించారు.