ఓ మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. కొందరు మహిళలు కర్రలతో కొడుతూ కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం షికారిపాలెంలో జరిగింది.
సదరు మహిళ ఇటీవల భర్త నుంచి విడిపోయి మరో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె తప్పుచేసిందంటూ పలువురు మహిళలు చిత్రహింసలు పెట్టారు. స్థానికుల సమాచారంతో వీరబల్లి పోలీసులు బాధితురాలిని పీఎస్కు తీసుకెళ్లారు. ఆమె నుంచి ఎస్సై ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.