Friday, September 20, 2024
HomeUncategorizedభార‌త పౌర‌స‌త్వం తీసుకున్న పాకిస్తానీ

భార‌త పౌర‌స‌త్వం తీసుకున్న పాకిస్తానీ

Date:

గోవాలో నివసిస్తున్న 78 ఏళ్ల జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పెరీరాకు భారత పౌరసత్వం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ చేతుల మీదుగా పెరీరా ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర పర్యాట‌క‌ శాఖ మంత్రి రోహన్‌ అశోక్‌ ఖౌంటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ.. పెరీరా గోవాకు చెందినవారైనా పాక్‌లో ఉండటంతో పౌరసత్వం విషయంలో ఇబ్బందులు పడినట్టు చెప్పారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం-2019 ప్రకారం పెరీరాకు పౌరసత్వం లభించిందన్నారు. గోవా నుంచి పౌరసత్వం అందుకున్న మొదటి వ్యక్తి పెరిరా అని సావంత్‌ పేర్కొన్నారు. ఇంకా చాలా మంది సీఏఏకు అర్హులైన వారు గోవాలో ఉన్నారని, వారు ఎవరైనా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చని వివరించారు. ఇప్పటికే దేశంలో అనేక మంది సీఏఏ చట్టాన్ని వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

గోవాకు చెందిన జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పెరిరా స్వాతంత్య్రానికి ముందు ఉన్నత చదువుల కోసం పాకిస్థాన్‌కు వెళ్లారు. అనంతరం అక్కడ ఉద్యోగంలో చేరారు. స్వాతంత్య్రం అనంతరం ఆయన పాకిస్థాన్‌లోనే ఉండిపోవడంతో ఆయనకు అక్కడి పౌరసత్వం లభించింది. 1946లో గోవాకు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నారు. 2013లో ఉద్యోగ విరమణ తర్వాత భారత్‌కు తిరిగొచ్చారు.