Monday, October 7, 2024
HomeUncategorizedభార‌త్‌లో ముస్లింల‌ను ఉండ‌నివ్వ‌డం పెద్ద త‌ప్పు

భార‌త్‌లో ముస్లింల‌ను ఉండ‌నివ్వ‌డం పెద్ద త‌ప్పు

Date:

భార‌త‌దేశంలో ముస్లింల‌ను ఉండ‌నివ్వ‌డం పెద్ద త‌ప్పు అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశ విభజన జరిగాక.. ముస్లింలను భారత్‌లో ఉండనివ్వటం పెద్ద తప్పు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘1947లోనే ముస్లింలందర్నీ పాకిస్థాన్‌కు పంపినట్టయితే, భారతదేశం మరోలా ఉండేది. అలా జరగకపోవటం దేశానికి దురదృష్టకరంగా మారింది. ఈ దేశంలో ముస్లింలను ఉండనివ్వటం పెద్ద తప్పు’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యల్ని ఆర్‌ఎస్‌ఎస్‌ మ్యాగజైన్‌ ‘పాంచజన్య’ సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో షేర్‌చేసింది.