Thursday, September 19, 2024
HomeUncategorizedనిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

Date:

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆదివారం వివరణ ఇచ్చారు.

”ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇళ్లను పడగొట్టం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం కూల్చేస్తాం. మల్లంపేట చెరువులో కూల్చి వేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారు. గతంలో కూడా వాటిని కూల్చేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నాం. బిల్డర్‌ విజయలక్ష్మిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్‌రెడ్డిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. నివాసం ఉంటున్న ఏ ఇంటినీ కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలు, ఇళ్లు మాత్రం కొనుగోలు చేయొద్దు” అని రంగనాథ్‌ తెలిపారు.