Friday, October 4, 2024
HomeUncategorizedనినాదాన్ని మాతృభాషలో తప్పుగా రాసిన కేంద్రమంత్రి

నినాదాన్ని మాతృభాషలో తప్పుగా రాసిన కేంద్రమంత్రి

Date:

‘బేటీ బచావో, బేటీ పడావో’ను పాపులర్ నినాదాన్ని ఒక మహిళా కేంద్రమంత్రి సరిగా రాయలేకపోయారు. కేంద్రమంత్రి మాతృభాషలో ఈ పదాన్ని తప్పుగా రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

సావిత్రి ఠాకుర్‌.. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రమహిశా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన ‘స్కూల్‌ ఛలో అభియాన్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదాన్ని ఒక బోర్డుపై రాశారు. అయితే దానిని సరిగా రాయలేకపోయారు. దానికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ”రాజ్యాంగ పదవుల్లో ఉండి, అతిపెద్ద మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూసుకుంటూ.. కనీసం మాతృభాషలో కూడా రాయలేకపోవడం శోచనీయం. అలాంటి వ్యక్తి తన మంత్రిత్వ శాఖను ఎలా నిర్వహిస్తారో..?” అని కాంగ్రెస్ నేత కేకే మిశ్రా ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు ఉండేలా రాజ్యాంగంలో మార్పులు చేయాలని సూచించారు. అయితే ఈ విమర్శలను భాజపా ఖండించింది. అది హడావుడిలో జరిగిన పొరపాటని, ఆదివాసీ మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడింది.