Tuesday, September 24, 2024
HomeUncategorizedనాయకులారా.. మీ దండాలకో దండం...

నాయకులారా.. మీ దండాలకో దండం…

Date:

నాయకులకు ఎన్నికల ముందే ప్రజలు గుర్తుకు వస్తారు. ఎన్నికల ముగిశాక ప్రజల మొఖాన చూడరు. నాయకులారా.. మీ దండాలకో దండం… ఇకపై ఓట్ల కోసం మా ఇళ్లకు రాకండి’ అంటూ బోర్డు హైదరాబాద్లో వెలిసింది. మణికొండ పరిధి ఖీజ్రా ఎనక్లేవ్ ప్రాంతంలో కొన్ని రోజులుగా నీటి సమస్య తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని , అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ మేరకు తాము పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస అవసరాలు తీర్చడం లేదని స్థానికులు ఇంటి ముందు బోర్డులు ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంతంలో ఓట్లు అడగటానికి రాజకీయ నేతలకు అనుమతిలేదని, నేతలు ఎవరూ రావొద్దంటూ బోర్డులు ఏర్పాటు చేసి ఆ ప్రాంత వాసులు వినూత్న నిరసన బాట పట్టారు.