Monday, September 30, 2024
HomeUncategorizedతెలంగాణలో కనీసం 12 స్థానాల్లో బిజెపిని గెలిపించాలి

తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో బిజెపిని గెలిపించాలి

Date:

దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. 400కు పైగా స్థానాల్లో బిజెపిని గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెదక్‌ బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ‘బిజెపి విశాల జన సభ’లో ప్రసంగించారు. తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో బిజెపి గెలిపించాలని ఓటర్లను కోరారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మోదీ కృషి చేశారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారు. మోడీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉంది. మజ్లిస్‌కు భయపడటం వల్లే భారాస, కాంగ్రెస్‌ నిర్వహించడం లేదు. బిజెపి అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కచ్చితంగా నిర్వహిస్తాం” అని అమిత్‌షా అన్నారు.