Friday, October 4, 2024
HomeUncategorizedతీహార్ జైలులో కవితను కలిసిన కేటీఆర్

తీహార్ జైలులో కవితను కలిసిన కేటీఆర్

Date:

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఖైదీగా ఉన్నారు. జైల్లో ఉన్న కవితను శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెను కలిసిన అనంతరం కేటీఆర్ హైదరాబాద్కు తిరుగు పయనం అయ్యారు. ఇటీవలే కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించిన సంగతి తెలిసిందే. కవిత జూన్ 21వ తేదీ వరకు జైలులో రిమాండ్ లో ఉండనున్నారు. మరోవైపు కోర్టులో చదువుకోవడానికి ఆమె తొమ్మిది పుస్తకాలు కావాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరుగనుంది. అదే రోజు సీబీఐ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. అయితే కవితను బయటకు తీసుకురావడానికి ఆమె కుటుంబం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది.