Saturday, September 21, 2024
HomeUncategorizedతమ తదుపరి లక్ష్యం కృష్ణ జన్మభూమి

తమ తదుపరి లక్ష్యం కృష్ణ జన్మభూమి

Date:

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం పూర్తి అయిందని తమ తదుపరి లక్ష్యం కృష్ణుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో యోగి మాట్లాడుతూ కృష్ణ జన్మభూమి భూ వివాదం బీజేపీ తదుపరి ప్రాధాన్యత జాబితాలోకి రానుందని తేల్చిచెప్పారు. మదురలో 17వ శతాబ్ధానికి చెందిన మసీదు షాహి ఈద్గా శ్రీకృష్ణుడు జన్మస్ధలంపై నిర్మించారని హిందూ పిటిషనర్లు వాదిస్తున్నారు.

ఈ స్ధలంపై ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఆర్కియాలజికల్ సర్వేకు అనుమతి ఇచ్చింది. ఇక బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత వ్యాఖ్యలతో అయోధ్య అనంతరం కాశీ (వారణాసి), మధుర అంశాలు కాషాయ పార్టీ ప్రధాన అజెండాగా ముందుకొచ్చాయని విస్పష్టంగా వెల్లడైంది. కాశీ, మధుర కూడా విముక్తి అయితే హిందువులు ఆలయాలకు సంబంధించిన సమస్యలను మరిచిపోతారని అయోధ్య ఆలయ ట్రెజరర్ గోవింద్ దేవ్ గిరి మహరాజ్ పేర్కొన్న నేపధ్యంలో యోగి ఆదిత్యానాధ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయోద్య 5000 ఏండ్లకు పైగా అన్యాయానికి గురైందని యోగి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో అయోధ్యలోని రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.