Tuesday, October 1, 2024
HomeUncategorizedతన తల్లిపై ప్రజ్వల్‌ రేవణ్ణ అత్యాచారం చేసాడు

తన తల్లిపై ప్రజ్వల్‌ రేవణ్ణ అత్యాచారం చేసాడు

Date:

ప్రజ్వల్‌ రేవణ్ణ తన తల్లిపై నాలుగైదేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ ఆరోపించింది. దీనికి సంబంధించి సిట్‌ అధికారుల ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చింది. అంతే కాకుండా ప్రజ్వల్‌ వీడియో కాల్‌లో బెదిరించి తన దుస్తులు విప్పించాడని తెలిపింది. ”ఆయన మా అమ్మ ఫోన్‌కు కాల్‌ చేసి.. వీడియో కాల్‌లో మాట్లాడాలని నన్ను బలవంతం చేసేవాడు. నా దుస్తులు విప్పాలని అడిగేవాడు. నేను అందుకు నిరాకరిస్తే.. నాకు, మా అమ్మకు హాని తలపెడతానని బెదిరించేవాడు” అని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ప్రజ్వల్‌, హెచ్‌డీ రేవణ్ణ తన తల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపింది. తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించి తనపై, తన తల్లిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. తాము ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే.. తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంది. తన నివాసంలో పనిచేసే మహిళలను ప్రజ్వల్‌ వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ప్రజ్వల్‌ బాధితుల్లో ఎంతో మంది మహిళలు ఉన్నారని.. కేవలం ముగ్గురు మాత్రమే వారి దారుణాలను బయటపెట్టారని చెప్పింది. ఈ ఘటన అనంతరం తమ భూమిని కూడా బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఆయన తండ్రిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.