మధ్యప్రదేశ్ హర్దా జిల్లాలోని ఓ టపాసుల తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా
పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరాగఢ్ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రగాయాలతో 25 మంది ఆసుపత్రిలో చేరారు. ఈ పేలుడు శబ్ధం దాదాపు రెండు కిలోమీటర్ల దాకా వినిపించింది. చుట్టుపక్కల 60 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. పేలుడు సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ సుమారు 100 ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. మంటల ధాటికి పలు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.