Wednesday, October 2, 2024
HomeUncategorizedచార్ధామ్ యాత్రలో 50 మందికి పైగా భక్తులు మృతి

చార్ధామ్ యాత్రలో 50 మందికి పైగా భక్తులు మృతి

Date:

దేశంలోనే పేరుగాంచిన యాత్ర చార్ధామ్.. ప్రతి ఒక్క హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా చార్దామ్ యాత్ర చేయాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి సంవత్సరం చార్దామ్ వెళ్లే యాత్రికుల సంఖ్య పెరిగిపోతుంది. ఈనెల 15 నుంచి ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర్ తెలిపారు. ముగ్గురు గంగీత్రిలో, 12 మంది యమునోత్రిలో, 4 మంది బద్రినాథ్, 23 మంది కేదార్ నాథ్ యాత్రలో మరణించారని వివరించారు. 50 ఏళ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేశామన్నారు.