Sunday, September 22, 2024
HomeUncategorizedచచ్చిన పామును ఎవరైనా చంపుతారా..?

చచ్చిన పామును ఎవరైనా చంపుతారా..?

Date:

చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? ఆ అవసరం మాకేంటి? సానుభూతి కోసం వీల్‌ఛైర్‌ నాటకాలు ఆడుతున్నారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడకపోతే చర్చకు రావాలి? సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాలెందుకు అని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాల అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ మేడిపండులా కుంగిపోతే నీరు నింపడం సాధ్యమా అని ప్రశ్నించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. నల్గొండలో నిర్వహించిన బిఆర్ఎస్ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మేడిగడ్డ అంశంలో కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వమే తప్పుచేసినట్లు.. మేమే బాధ్యత వహించాలన్నట్లుగా బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. పదేపదే భాష, మాటలపై సభలో చర్చ జరుగుతోంది. నల్గొండ సభలో మాజీ సీఎం మాట్లాడిన మాటలపై చర్చ చేద్దామా? కేంద్ర మంత్రి, సీఎం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి.. సీఎంపై అలాంటి భాష మాట్లాడతారా?ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదు. ఓట్లేసి గెలిపించిన సీఎంను ఉద్దేశించి ఆ భాష వాడతారా? కేసీఆర్‌, హరీశ్‌రావుకే పెత్తనం ఇస్తాం..

మేడిగడ్డలో నీళ్లు నింపి అక్కడి నుంచి అన్నారం, సుందిళ్లలో ఎత్తిపోయించే బాధ్యత మీరే తీసుకోండి. రూ.94వేల కోట్లు వృథా అయి ప్రాజెక్టే దెబ్బతింటే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సభకు రాకుండా సీఎంను ఇలా మాట్లాడొచ్చా? చర్చకు సిద్ధమైతే.. బిఆర్ఎస్ పక్ష నేతను సభకు రమ్మని చెప్పండి. రేపు సాయంత్రం వరకు చర్చ చేపట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.