Saturday, September 21, 2024
HomeUncategorizedగత ఏడాది కంటే ఈసారి ఎండలు ఎక్కువే

గత ఏడాది కంటే ఈసారి ఎండలు ఎక్కువే

Date:

ఇంకా చలికాలం పోనే లేదు అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. తెలంగాణలో గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సారి ఎండలు ముందే రానున్నాయి అని.. గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉండనున్నాయి అని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంతేకాదు వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.

ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలి కాలం పూర్తి అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగా మారుతుంది. గత సంవత్సరంతో పోల్చితే చలి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలు అవుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవిలో ఉండనుంది అని నిపుణులు అంటున్నారు.

మామూలుగా మార్చి నెల మధ్య నుండి ఎండాకాలం ప్రభావం మొదలవుతుంది. కానీ ఈ సంవత్సరం నెల ముందు నుండే ఫిబ్రవరి నెల చివరి నుండి ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. వాతావరణలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్ల భూ తాపం ఎప్పటికప్పుడు పెరుగుతుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవిలో వడ గాల్పుల ప్రభావం చూపనుంది అని.. సమ్మర్ మొత్తంలో హీట్ వేవ్స్ కొన్ని సార్లు ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతూ, పెరుగుతూ నెల చివరి నాటికి ఎండ తీవ్రత పెరుగుతుంది అని అంటున్నారు. ఒకటి, రెండు రోజుల తరవాత ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే ఛాన్స్ ఉంది అని వాతావరణ శాఖ చెపుతుంది.