Sunday, September 29, 2024
HomeUncategorizedకేరళ లోక్‌సభ ప్రచారానికి రేవంత్ రెడ్డి

కేరళ లోక్‌సభ ప్రచారానికి రేవంత్ రెడ్డి

Date:

కేరళలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. దేశంలో మొత్తం ఏడు దశలలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా.. అవసరాన్ని బట్టి వివిధ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొనేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కేరళలోని వయనాడు నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

కేరళలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా అక్కడ పర్యటించి.. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రెండు రోజుల పాటు కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి బుధవారం కేరళ బయలుదేరి వెళ్లారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడులో రేవంత్ రెడ్డి ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రజల నుంచి ఓట్లు కోరనున్నారు. గురువారం కూడా కేరళలో ఒకరిద్దరు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గురువారం రాత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.