Wednesday, October 2, 2024
HomeUncategorizedకేదార్‌నాథ్‌ యాత్రికులకు త్రుటిలో పెనుప్రమాదం

కేదార్‌నాథ్‌ యాత్రికులకు త్రుటిలో పెనుప్రమాదం

Date:

కేదార్‌నాథ్‌కు బయల్దేరిన యాత్రికులకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తి గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే, పైలట్‌ అప్రమత్తత వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

కేస్ట్రల్‌ ఏవియేషన్‌కు చెందిన హెలీకాప్టర్‌ సిస్రీ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరింది. అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తుండగా గాల్లో చక్కర్లు కొడుతూ హెలిప్యాడ్‌కు సుమారు 100 మీటర్ల దూరంలో గడ్డి నేలపై ల్యాండ్‌ అయ్యింది. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు, పైలట్ సురక్షితంగా ఉన్నారు.