Monday, October 7, 2024
HomeUncategorizedఉజ్జయిని మహంకాళి సన్నిధిలో రేవంత్ రెడ్డి

ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో రేవంత్ రెడ్డి

Date:

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి రేవంత్ రెడ్డికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు రాత్రి లేదా సోమవారం ఉదయం రాహుల్ గాంధీతో సమావేశం కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అప్పుడే రూ.2 లక్షల రుణ మాఫీ హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన హామీని కాంగ్రెస్ అమలు చేస్తోంది. రైతులకు రూ.లక్ష లోపు ఉన్న రుణాలు మాఫీ చేసింది. ఆగస్ట్ 15 కల్లా రూ.2 లక్షల రుణ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.