Sunday, September 22, 2024
HomeUncategorizedఅధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధర

అధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధర

Date:

దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే వెంటనే రైతులకు కనీస మద్దతు ధరను అమలు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసుల మేరకు దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు పండించిన ప్రతి పంటకూ కనీస మద్దతు ధరను చెల్లిస్తామని అన్నారు. దీని వల్ల దేశంలో 15 కోట్ల మంది రైతులకు లబ్ది కలుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశానికి రైతులే వెన్నెముక అనే సూత్రాన్ని తాము బలంగా నమ్ముతున్నామని పేర్కొన్నారు. ప్రతి రైతు ఇల్లూ సుభిక్షంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన తొలి గ్యారంటీ ఇదేనని అన్నారు.