Wednesday, September 25, 2024
Homeతెలంగాణఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలి

ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలి

Date:

దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న రాజీవ్‌ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సూచించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని సూచించారు. గృహనిర్మాణశాఖపై సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

బీసీ కులగణన కోసం వెంటనే కార్యచరణ ప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులకు ముఖ్యమంత్రి తెలిపారు. బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు సచివాలయంలో సీఎంను కలిశారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రితో కమిషన్ ఛైర్మన్, సభ్యులు చర్చించారు. బీసీ కులగణన ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధానాలను పరిశీలించాలని సీఎం తెలిపారు. బీసీ కులగణన వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం హామి ఇచ్చారు.