భారతప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్స్ను ఇటీవల ప్రకటించింది. 28 రోజులు, 30 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్స్ బడ్జెట్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటాయని నిపుణులు చెబతున్నారు. దీంతో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీఐ వినియోగదారులు చౌకైన రీచార్జ్ ఇచ్చే కంపెనీల గురించి వెతుకుతున్నారు. ఇలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
రూ.108 ప్లాన్
స్టాండ్అవుట్ రీఛార్జ్ ప్లాన్లలో భాగంగా రూ. 108తో 28 రోజుల వ్యాలిడిటీతో కొత్త రీచార్జ్ ప్లాన్ మన ముందుకు బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. అదనపు ఛార్జీల గురించి ఎలాంటి చింత లేకుండా అపరమిత కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. అలాగే రోజుకు 1 జీబీ డేటా వస్తుంది. ఒకవేళడేటా అయిపోతే వినియోగదారులు 40 కేబీపీఎస్ వేగంతో బ్రౌజ్ చేయడం కొనసాగించవచ్చు. అయితే ఇది ఫస్ట్ రీఛార్జ్ కూపన్ ప్లాన్ అని గమనించాలి, అంటే ఇది కొత్త నంబర్తో మాత్రమే యాక్టివేట్ అవుతుంది. మంచి డేటా, అపరిమిత కాల్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ నెట్ వర్క్ కోసం చూస్తున్న కొత్త వినియోగదారులు ఈ రీఛార్జ్ ప్లాన్ మంచి ఎంపికగా ఉంటుంది.
రూ.199 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ రూ.199తో 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రీచార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ అపరిమిత ఉచిత కాలింగ్తో 30 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం నెలకు 60 జీబీ డేటాను అందుబాటులో ఉంటుంది. అంటే రోజుకు 2జీబీ డేటాకు అనువదిస్తుంది. అలాగే ఈ ప్లాన్ కింద రోజుకు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఈ ప్లాన్ ఒక నెల పాటు డేటా, కాలింగ్ ప్రయోజనాలు రెండూ అందిస్తుంది.