దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే.. జూన్ 5న తిహార్ జైలు నుంచి విడుదలవుతానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ జూన్ 2న లొంగిపోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ ‘తిహార్లోని తన సెల్లో రెండు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.
ఫీడ్ను 13 మంది అధికారులు పర్యవేక్షించారు. సీసీటీవీ ఫీడ్ను పీఎంవోకు సైతం అందించారు. మోదీ సైతం పర్యవేక్షిస్తున్నారు. మోదీకి తనపై ఎలాంటి పగ ఉందో నాకు తెలియదు. బూత్ర్రూమ్కి వెళ్లడానికి నేను రాత్రి ఏ సమయానికి లేస్తానో కూడా వారు పర్యవేక్షించే వారు’ అన్నారు. కేజ్రీవాల్ డిప్రెషన్లో లేరని.. తనకు హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని వారికి చెప్పాలనుకుంటున్నానన్నారు. తాను జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లినప్పటికీ.. జూన్ 4న జైలులోనే ఫలితాలను చూస్తానన్నారు. ఇండియా కూటమి గెలిస్తేనే జూన్ 5న మళ్లీ బయటకు వస్తానన్నారు. మనం ఇప్పుడు కష్టపడకపోతే మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదన్నారు.