మహిళల భద్రతకు ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతోమందికి ఎన్నో శిక్షలు పడ్డ కొంతమంది రాక్షసుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తెలిసిన వారితో, స్నేహితులతో ఎవరితో బయటికి వెళ్లాలన్న భయపడుతున్న రోజులు ఇవి.. ఎవరిని నమ్మాలో, ఎవరి మనుసులో కామాంధుడు దాగి ఉన్నాడో తెలుసుకోలేక నిత్యం ఎంతోమంది అబలలు అఘాయిత్యాలకు గురవుతున్నారు.
ముందడుగు క్రైం
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళను అత్యాచారం చేశారు. నిర్మల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు వెళుతున్న బస్సులో మహిళపై ఈ అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సును ఆపి, సీజ్ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా.. వారిలో ఒకరైన సిద్దయ్యను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్ కృష్ణ (ప్రధాన నిందితుడు) కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేందర్ తెలిపారు.
లేడీ టెక్కీపై స్నేహితుల అత్యాచారం
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్పై స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికికు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన స్నేహితులతో కలిసి ఓ హోటల్కు వెళ్లారు. మద్యం మత్తులో తన స్నేహితుడు మరో వ్యక్తితో కలిసి తనపై దారుణానికి ఒడిగట్టాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.