మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకంకర్ ఈవీఎంకు హారతి ఇచ్చారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకురాలు కూడా పాల్గొన్నారు. ఈ హారతికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్పై సింహగడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో నిన్న పోలింగ్ కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బరిలో ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,561 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 23.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.