పరమశివుడి జ్యోతిర్లింగం ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఈ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో వీడియోలు షూట్ చేస్తుంటే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు.
శనివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలక్, పారి అనే ఇద్దరు మహిళలు ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో వీడియో రీల్స్ చేస్తుండగా.. మహిళా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో వారిపై ఆ ఇద్దరు మహిళలతో పాటు అక్కడ ఉన్న మరికొందరు దాడికి పాల్పడ్డారని స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జి అజయ్ వర్మ వెల్లడించారు.
మహిళా గార్డులుగా పనిచేస్తున్న వారిని శివానీ పుష్పాడ్, సంధ్య ప్రజాపతి, సంగీత చంగేసియాగా గుర్తించారు. ఈ ముగ్గురు సిబ్బంది ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ తరఫున ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరిపై అనుచితంగా దాడి చేసిన నిందితులు నాగ్దా పట్టణానికి చెందినవారిగా గుర్తించి.. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.