Wednesday, September 25, 2024
Homeక్రైంనడిరోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ

నడిరోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ

Date:

అరచేతిలో ఫోన్ ఉండటంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్నారు. ఒక మహిళ రోడ్డుపై సోషల్ మీడియా కోసం రీల్‌ చేస్తున్న బైక్‌పై వచ్చిన వ్యక్తి షాక్‌ ఇచ్చాడు. ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇందిరాపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళ అందంగా ముస్తాబైంది. రీల్‌ కోసం వీధిలో మెల్లగా నడుస్తున్నది.

ఇదే అవకాశంగా భావించిన ఒక వ్యక్తి బైక్‌పై ఆ మహిళ వద్దకు చేరుకున్నాడు. ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. అయితే చైన్‌ స్నాచర్‌ను అడ్డుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు షాక్‌ నుంచి తేరుకున్న ఆ మహిళ చైన్‌ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.