Saturday, September 28, 2024
Homeక్రైంతన భర్త ఇప్పటికి నన్ను ముట్టుకోవడం లేదు

తన భర్త ఇప్పటికి నన్ను ముట్టుకోవడం లేదు

Date:

తనకు పెళ్లి జరిగిన మూడు రోజుల నుండే తన భర్త దగ్గరకు రావడం లేదంటూ ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తోంది. పెళ్లైన మూడోరోజు నుంచే నా భర్త నా పక్కలోకి రావడం లేదంటూ సిగ్గు విడిచి చెప్పిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీఎస్ ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డితో పావని అనే అమ్మాయితో కొద్ది రోజుల క్రితం ఘనంగా వివాహం జరిగింది. అంతా బాగానే ఉందనుకునే సమయానికి పావని బయటకు వచ్చి తన గోడును వెళ్లబోసుకుంది. పెళ్లైనప్పటి నుంచి తన భర్త తనతో ఏనాడు సంతోషంగా లేడని.. తనని ముట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కింది. పెళ్లైన మూడోరోజు నుంచి నా భర్త నా పక్కలోకి రావడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు’ అని వాపోయింది. తాను వచ్చే సమయానికి కార్తీక్ రెడ్డి కుటుంబ సభ్యులు గెటుకు తాళం వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారని.. పైగా తనపై రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారని కన్నీరు పెట్టుకుంది.

తనకు ఎలర్జీ అంటూ లేని పోని ఆరోపణలు చేస్తూ తన భర్తను దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా .. పోలీసులు అక్కడికి చేరుకొని పావనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా తనకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తి లేదని భర్త ఇంటి ముందే పావని బైఠాయించింది. నా భర్త నాకు కావాలి అంటూ పోరాటం చేస్తోంది. పావని ఎల్బీనగర్‌లోని తన అత్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. అయితే పావనికి సోరియాసిస్ ప్రాబ్లం ఉందని, ఆ విషయం దాచి తన కొడుకు కార్తీక్ రెడ్డిని పెళ్లి చేసుకుందని రాజిరెడ్డి చెబుతున్నారు. ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తుందని ఆయన తెలిపారు.