Sunday, October 6, 2024
Homeక్రైంచదువు చెప్పే గురువును చంపిన విద్యార్థి

చదువు చెప్పే గురువును చంపిన విద్యార్థి

Date:

కొన్ని సంఘటనలు చూస్తుంటే సమాజం ఏటు పోతుందో అర్థమే కావడం లేదు. మార్కులు తక్కువొస్తున్నాయని విద్యార్థిని మందలించినందుకు గురువును అత్యంత దారుణంగా చంపేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాంలోని శివసాగర్‌ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. 11వ తరగతికి చెందిన ఓ విద్యార్థి కత్తితో తన కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు రాజేశ్‌ బారువాను పొడవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

కెమిస్ట్రీ బోధించటంతో పాటు రాజేశ్‌ స్కూల్‌ నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తుండేవారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థికి తక్కువ మార్కులు రావటంతో రాజేశ్‌ అతన్ని మందలించాడు. తల్లిదండ్రులను తీసుకురమ్మని ఇంటికి పంపాడు. కొంత సమయం తర్వాత ఆ విద్యార్థి మామూలు దుస్తుల్లో కాస్ల్‌కు తిరిగొచ్చాడు. గమనించిన ఉపాధ్యాయుడు వెంటనే ఇంటికి వెళ్లపోమని ఆదేశించాడు. దీంతో కోపోద్రిక్తుడైన విద్యార్థి.. అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో రాజేశ్‌ను పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై ఆయన నెలకొరిగి విలవిల్లాడాడు. తోటి విద్యార్థుల సమాచారంతో అప్రమత్తమైన స్కూల్‌ యాజమాన్యం అయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించింది. కానీ, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.