Thursday, September 19, 2024
Homeక్రైంకూతురిని వ్యభిచార గృహానికి అమ్మిన తల్లి

కూతురిని వ్యభిచార గృహానికి అమ్మిన తల్లి

Date:

పశ్చిమ బెంగాల్ లో ఒక మహిళ తన కన్న కూతురి పాలిట యముడిగా మారి అమ్మ ప్రేమకు మచ్చ తెచ్చింది. ఆ తల్లి చేసిన దారుణానికి నిండు నూరేళ్లు బతకాల్సిన కూతురు ప్రాణాలు కోల్పోయింది. కోల్ కతాకి చెందిన ఓ మహిళ డబ్బుల కోసం కక్కుర్తిపడి తన మైనర్ కూతురిని రెండు సార్లు వ్యభిచార గృహాల్లో అమ్మేసింది. 2021లో బీహార్‌ లోని ముజఫర్‌పూర్‌లోని వ్యభిచార గృహానికి తన కూతురిని మహిళ మొదట విక్రయించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమాచారం అందుకున్న ఓ ఎన్జీవో కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ముజఫర్‌పూర్ చేరుకుని బాలికను రక్షించారు. బాలిక తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి బాలికకను తిరిగి ఆమెకు అప్పగించారు.

అయితే పోలీసుల ఎదుట పశ్చాత్తాపం నటించిన ఆ మహిళ తిరిగి 2022లో తన కుమార్తెను ఓ ఏజెంట్ ద్వారా ఉత్తర కోల్‌కతాలోని సోనాగాచి వ్యభిచార గృహానికి విక్రయించింది. ఇది ఆసియాలో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాలలో ఒకటి. ఈసారి వ్యభిచార గృహ యజమాని, అక్కడ సందర్శించే వేర్వేరు కస్టమర్ల చేతిలో బాలిక లైంగిక దోపిడీకి గురైంది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆ వ్యభిచార గృహ యజమాని బాలికను విడిచిపెట్టాడు. బాలికను ఆమె తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్జీవో సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బాలికను తీసుకెళ్లి హాస్పిటల్ లో చేర్పించారు. అయితే డాక్టర్ల ప్రయత్నాలన్నీ ఫలించకపోవడంతో చివరకు చికిత్స పొందుతూ గురువారం బాలిక మృతి చెందింది.